Tuesday, January 29, 2013

వర్షపు నీరు బిందువులుగానే పడుతుంది ఎందుకు?

ఆకాశంలో మేఘాలు వ్యాకోచించటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. మేఘాలలోని నీటి ఆవిరి ద్రవీకరణ చెంది చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. దాన్నే మనం వర్షం అంటాం. అయితే వ్యాకోచం చెందే మేఘాలు సెకనుకు 1నుంచి 10 మీటర్ల వేగంతో పైకి పోతూ ఉంటాయి. ఇలా పైకి పోయే మేఘాలతోపాటు చిన్న చిన్న బిందువులు కూడా పైకి వెళ్తున్నప్పుడు వాటికి మరికొన్ని నీటి బిందువులు తోడయి పెద్ద బిందువుగా మారుతుంది.

ఇలా బరువెక్కిన నీటి బిందువు పైకి వెళ్లలేక భూమ్యాకర్షణ శక్తి కారణంగా కిందికి పడుతుంది. అంతేకాక స్వల్ప పరిమాణంలోని నీటి బిందువు గోళాకార రూపాన్ని పొందుతుంది. గాలిలోని నీటి ఆవిరి నీటి బిందువుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరిగేది కాబట్టి వర్షం బిందువులుగానే పడుతుంది. అయితే అల్ప పీడనం ఏర్పడినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎక్కువ నీటి ఆవిరి ద్రవీకరణ చెందడం వలన నీటి బిందువులు ఒక దాని వెంట మరొకటి పడుతూ వర్షం ధారలాగా కన్పిస్తుంది. దీనినే మనం కుండ పోత వర్షం అంటాం.

అత్యంత బద్దకంగా ఉండే జంతువు ఏది?

మనుషుల్లో బద్దకస్తులు ఉంటారని తెలుసు. కానీ జంతువుల్లో కూడా బద్దకంగా ఉండే జంతువులు ఉన్నాయట. స్లోత్స్ అనే జంతువులు రోజుకి దాదాపు 23 గంటలు నిద్ర పోతాయి. అందుకే వీటిని అత్యంత బద్దకం ఉన్న జంతువులుగా పరిగణిస్తున్నారు. స్లోత్స్ అనే ఈ క్షీరదాలు ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. ఇవి మధ్య, దక్షిణ అమెరికాలో ఉంటాయి. చిన్న కుక్క పిల్ల సైజులో ఉండే స్లోత్స్ జీవితకాలం దాదాపు 30 సంవత్సరాలు.

స్లోత్స్ రాత్రిపూట చురుకుగా ఉంటాయి. స్లోత్స్ చెట్ల మీదే నిద్రపోతాయి. నిద్రపోయేటప్పుడు రెండు కాళ్లను దగ్గరగా చేసి చేతుల మీద తలను పెట్టుకుంటాయి. ఇవి చూడడానికి చెట్టులో భాగంగానే కన్పిస్తాయి. ఇవి సాధారణంగా చెట్టు మీద నుంచి దిగవు. ఎప్పుడైనా చెట్టు మీద నుంచి కిందికి దిగితే కాళ్లు ఉన్నా నడవకుండా పాకుతూ ఉంటాయి. వరదలు వచ్చిన సందర్భాల్లో ఈత కొడతాయి. వీటికి జీర్ణాశయం పెద్దది. అయినప్పటికీ జీర్ణక్రియ చాలా మందకొడిగా జరుగుతుంది. ఒక్కొక్కసారి జీర్ణక్రియ పూర్తి కావటానికి నెల రోజులు కూడా పడుతుంది. అందుకే ఇవి ఎక్కువ సమయం నిద్రపోతుంటాయి.

నిరుపయోగమైన విద్య

ఒక ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక ముని దగ్గరకు వెళ్లి, ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు. అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు. అయిన్పటికీ నేర్పమని పట్టుపట్టారు ఆ నలుగురు. తప్పేది లేక ముని ఆ నలుగురికీ నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పాడు. వారు ఆ విద్యలను నేర్చుకుని, తమ ఊరికి ప్రయాణమయ్యారు.

ఒక అడవిగుండా ప్రయాణిస్తూండగా మార్గమధ్యంలో వాళ్లకి కొన్ని ఎముకలు కనిపించాయి. అవి చూడగానే ఆ నలుగురికీ తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందనుకుని సంతోషం కలిగింది.

మొదటివాడు ఎముకల వాసన చూసి ‘ఇవి సింహం ఎముకలు’ అన్నాడు.
రెండవవాడు ‘నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను’ అని అలాగే చేశాడు.
మూడవవాడు, ‘నా విద్యతో ఈ అస్థిపంజరంపై మాంసాన్ని, చర్మాన్ని తెస్తాను’ అని, మంత్రం చదివి, సింహాన్ని తయారుచేశాడు.

నాలుగవ వాడు ‘ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి’ అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోశాడు. దానికి ప్రాణం వచ్చింది.

వెంటనే సింహం లేచి కూర్చుంది. ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు సంతోషించారు. ఇంత మంచి విద్యలని ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడ్డారు. ‘ఇక బయలుదేరదాం’ అనుకుంటూ ఉండగా వాళ్లు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది.

ఎదురుగా ఉన్న నలుగురినీ చూసింది. తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చేయదనుకున్నారు నలుగురు స్నేహితులు. కానీ, ఆ సింహం అమాంతం వాళ్లని చంపి, తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది.పెద్దల మాట వినాలి. లేకపోతే ఈ నలుగురు స్నేహితులకి జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది.

సమయస్ఫూర్తి

              ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.

అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి,
ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు.

రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు.

ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక,
రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు.

ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు.

వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు.
మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు.
ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.

చీమంత బరువును మోయగలమా?

చీమలను ఐకమత్యానికి గుర్తుగా పేర్కొంటాం. క్రమశిక్షణలో కూడా వాటికి ప్రత్యేకత ఉంది. ఒకే పుట్టలో చాలా చీమలు కలిసి ఉండటమే కాదు, విపత్కర పరిస్థితిలో అన్ని చీమలూ కలిసి పోరాడతాయి. వీటి శరీర నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

చీమలు పది కోట్ల సంవత్సరాల క్రితం కందిరీగల నుంచి విడిపోయి ఒక ప్రత్యేక జీవులుగా రూపాంతరం చెందాయి. సుమారు 22 వేల రకాలు చీమలు ఉన్నాయని అంటారు. చీమలకు మానవుని శరీరంలో లాగా ఊపిరితిత్తులు, గుండె ఉండవు, వీటికుండే రక్తానికి కూడా రంగు ఉండదు. వీటి శరీరం పైకవచానికి ఉండే సన్నటి రంధ్రాల ద్వారా చీమలు ఊపిరి పీల్చుకుంటాయి. వీటికి బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా వాటి తలలో చిన్నచిన్న కళ్లు అనేకం ఉంటాయట.

చీమలు ఆహారసేకరణలో ముందుచూపుతో ఉంటాయని కూడా మనకు తెలిసిందే. అయితే ఈ చీమలు వాటి బరువు కంటే ఇరవై రెట్లు బరువును మోయగలవు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది నిజం. కొన్ని రకాల చీమలైతే వాటి బరువు కంటే 25 నుంచి 50 రెట్ల బరువును కూడా లాక్కొని వెళ్లగలవట.

చీమలతో పోలిస్తే మనం అవి మోసినంత బరువులో పదోవంతు కూడా మోయలేమేమో! పెద్ద పెద్ద వస్తాదులు, వెయిట్‌లిఫ్టర్లు కూడా మహా అయితే వారి బరువుకన్నా నాలుగైదు రెట్లు బరువును మాత్రమే మోస్తారు! దీనినిబట్టి మనం చీమ మోసిన స్థాయిలో బరువును మోయలేమని రుజువైనట్లే కదా!

చంద్రుడు చల్లగా ఎందుకు ఉంటాడు?

పౌర్ణమిరోజు ఆకాశంలో కనిపించే వెన్నెల, చంద్రుని చల్లదనం గురించి చెప్పాలంటే కవులు చెప్పాల్సిందే. ఆ చల్లదనాన్ని మన మాటల్లో చెప్పలేం. అంత హాయిగా ఉండే పౌర్ణమి చంద్రుడి చల్లదనం గురించి శాస్త్ర విజ్ఞానం ఏం చెబుతుందో చూద్దాం. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడికి స్వయంప్రకాశక శక్తి లేదు. తన మీద పడిన సూర్యకాంతిని శోషించుకున్న చంద్రుడు మిగిలిన కాంతినే పరావర్తనం చెందిస్తాడు. ఆ కాంతిలో ఉండే వేడిశక్తిని కూడా భూమి

వాతావరణంలోని గాలి అణువులు పంచుకుంటాయి. కాబట్టి అంత వేడి అనిపించదు. అందుకే చంద్రుడి కాంతి నుంచి వచ్చే వెన్నెల అంత చల్లగా ఉంటుంది. కాంతిని గ్రహించిన పస్తువులలోని పరమాణువుల చలనాలకు సంబంధించిన యాంత్రికశక్తిని వేడి అంటారు. ఆ వేడి వస్తువుపై పడిన కాంతి తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి ఉత్పత్తి స్థానంలోనే అధికమైన శక్తితో విడుదల అవుతుంది. అందుకే సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న భూమిపై కూడా వేడి పుట్టిస్తున్నాడు.

కాకి లెక్కలు

ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లేసరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడనీ, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారనీ అర్థమయ్యింది బీర్బల్‌కి.

అతను నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, ‘‘విషయం ఏమిటి జహాపనా?’’ అని అడిగాడు.

‘‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకి పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’’ అన్నాడు కోపంగా.

‘‘అసలు సంగతేంటి జహాపనా?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘మన రాజ్యంలో మొత్తం కాకులెన్ని ఉన్నాయో అని వీళ్లని అడిగితే ముఖాలు వేళ్లాడేసుకుని తెలియదు అంటున్నారు’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ఓస్ అంతేనా!’’ అన్నాడు బీర్బల్.

‘‘నీకు తెలుసా?’’ అడిగాడు చక్రవర్తి.

‘‘ఓ! మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి’’ చెప్పాడు బీర్బల్.

‘‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే?’’ అడిగాడు చక్రవర్తి.
మన రాజ్యంలో ఉన్న చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాల నుంచి కొన్ని కాకులు వచ్చి ఉంటాయి ప్రభూ!’’

‘‘అలాగా! మరి తక్కువ ఉంటే?’’

‘‘ఉండొచ్చు ప్రభూ! మన కాకులు వాళ్ల చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాలకు వెళ్లి ఉండొచ్చు కదా?’’ అన్నాడు బీర్బల్.

ఈ కాకి లెక్కలకు అక్బరు హాయిగా నవ్వుకున్నాడు.

Alien Solar System May Exist in Nearby Star Cluster

At 150 light-years from Earth, the Hyades cluster is the nearest star cluster to Earth's solar system and scientists have long wondered if some of those stars are home to alien planets.

Now, that particular mystery might be solved.

Astronomer Ben Zuckerman, a physics and astronomy professor at UCLA, and his team have discovered evidence that the atmosphere of a white dwarf star in the Hyades cluster is "polluted" with rocky material from pulverized asteroids pulled into orbit around the dying, super-dense star.

The presence of asteroid dust, Zuckerman said, suggests that larger objects like exoplanets, or possibly an entire solar system, may also be orbiting the white dwarf.

Measuring the atmosphere

Zuckerman told the scientists at the American Astronomical Society earlier this month that he and his team found traces of asteroid dust pollution in 50 to 100 of the white dwarfs they observed. The new discovery is the first of its kind seen in the Hyades system. Because this particular star cluster is relatively near Earth, the white dwarf is a great candidate for study, Zuckerman said. [The Nearest Stars to Earth (Infographic)]

Usually, white dwarf atmospheres are relatively "clean," Zuckerman said in the Jan. 8 presentation. Because the heavier elements in a dying star clump in the core, only light elements like helium and hydrogen are left swirling in the atmosphere.

By using a very sensitive spectrometer at the Keck Observatory in Hawaii, the team detected hints of calcium in the atmosphere of the star in its death throes.

"We looked at calcium because it’s the easiest element to detect in these stars," Zuckerman said.

John Debes of the Space Telescope Science Institute was able to confirm that the dust came from asteroids and not from another source by matching the team's new observations with earlier ones.

Signs of planets

Zuckerman described how the star would have become polluted by asteroid dust: "The gravity of the major planets perturbs the orbit of some of the asteroids in towards the white dwarf," he said. "They don't actually have to hit the white dwarf, but they have to get within the tidal radius of the white dwarf, and if that happens, then they get torn apart, torn asunder into little dust grains."

Once the asteroids are pulverized, they will start a new orbit, crafting a new planetary system around the white dwarf.

Of the 50 to 100 polluted white dwarfs Zuckerman's team has studied, it has detected more than 10 heavy elements in the atmospheres of many of the stars, he said.

The most abundant elements detected in these accretion discs — oxygen, silicon, magnesium and iron — are also the most abundant elements found in the Earth. The team also found some less common elements circling the distant stars.

"I didn’t even know that scandium was an element until we discovered it in the atmosphere of a white dwarf," Zuckerman said.

Based on observation and statistical analysis, Zuckerman thinks that at least one quarter of white dwarfs could be polluted with accreted dust, giving researchers the chance to study the insides of asteroids outside of the solar system.

Monday, January 28, 2013

కొత్తిమీర, పుదీనా, టొమాటో చట్నీ

టొమాటోలు - 4, శుభ్రపరిచిన కొత్తిమీర - అర కప్పు, పుదీనా - పావు కట్ట, మినప్పప్పు - అర టీస్పూన్, జీలకర్ర - పావు టీ స్పూన్, పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - టేబుల్ స్పూన్,

పోపు కోసం:
నూనె - టీ స్పూన్, ఆవాలు - అర టీ స్పూన్, ఎండుమిర్చి - 1, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెండు రెబ్బలు,

తయారి:
1. పాత్రలో రెండు టీ స్పూన్ల నూనె వేడయ్యాక, జీలకర్ర వేయించాలి. దీంట్లో మినప్పప్పు ఎరుపు రంగు వచ్చేలా వేయించి, పచ్చిమిర్చి, కొత్తిమీర , పుదీనా కలిపి 2 నిమిషాలు వేయించి తీయాలి.

2.అదే పాన్‌లో మిగతా నూనె వేడయ్యాక టొమాటో ముక్కలు వేసి 8 నిమిషాలు వేయించి తీసి చల్లార్చాలి.

3.ముందుగా మినప్పప్పు మిశ్రమం గ్రైండ్ చేసి తరవాత వేయించిన టొమాటో ముక్కలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పాత్రలోకి తీయాలి.

4.పాత్రలో టీ స్పూన్ నూనె వేడయ్యాక ఆవాలు చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి చివరగా ఇంగువ కలిపి తీసి వెంటనే పచ్చడి మిశ్రమంలో కలపాలి.

కోయిలత

ప్యార్ కియాతో డర్నాక్యా...
జబ్ ప్యార్ కియాతో డర్నాక్యా...

రంగీలారే- తేరే రంగ్‌మే
యూ రంగాహై- మేరా మన్....

యే జిందగీ ఉసీకిహై- జో కిసీకా హోగయా
ప్యార్‌హీ మే ఖోగయా...

ఓ సజ్‌నా... బర్‌ఖా బహార్ ఆయీ
రస్‌కీ పుహార్ లాయీ- అఖియోమే ప్యార్ లాయీ...

నైనా బర్ సే- రిమ్‌జిమ్ రిమ్‌జిమ్
పియా తోరే ఆవన్ కీ ఆస్....

ఠండీ హవాయే- లెహెరాకే ఆయే
రుత్‌హై జవా ఉన్‌కో యహా- కైసే బులాయే....

ఈ పాటలన్నీ ఆమెవి.
పంచి ఇచ్చిన ఈ పూలన్నీ ఆమెవి. ఈ మాధుర్యం అంతా ఆమెది.
పాట పట్ల ఉన్న ఈ ప్రేమ అంతా అమెదే.
ఇవాళ దేశం ఆమె పాటను సెలబ్రేట్ చేసుకుంటుంది.
ఒక వేడుకగా ఆమెతో గొంతు కలుపుతుంది.
హ్యాపీ బర్త్ డే టు యూ లతా.

ఇవాళ పాటలు మళ్లొక్కసారి శిశువులై కేరింతలు కొడతాయి. బుగ్గల మీద రంగులు పూసుకొని తియ్యగా నవ్వుతాయి. ఉదయపు నీరెండలో మెత్తగా దోగాడతాయి. మద్యాహ్నం హటాత్తుగా కురిసే కుంభవృష్టిలో రోడ్డువారగా నిలబడి తడిసి ముద్దవుతాయి. సాయంత్రపు పూట తొలిప్రేమలో ఉన్న ఒక జంట పెదాలకు పల్లవుల రుచిని అద్దుతాయి. పాటలు ఇవాళ పాటను ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెను లతలా అల్లుకుపోతాయి. లతల్లా పెనవేసుకుపోతాయి.

ఆయేగా... ఆయేగా...
ఆనే వాలా ఆయేగా.. ఆయేగా...
లతా మంగేష్కర్ పాటను ఈ దేశం క్రితం జన్మ నుంచీ వింటోంది. బహుశా రాబోయే జన్మలో కూడా వింటుంది. మరో పది జన్మలైనా వింటుంది. ఎందుకంటే లతా పాటలో ఆర్ట్ ఉంది, క్రాఫ్ట్ ఉంది. ఈ రెంటినీ రెండు రెక్కలుగా చేసుకున్న ఈ పిట్ట అందుకే రివ్వున ఎగురుతూనే ఉంది.

పంఛీ బనూ ఉడ్‌తీ ఫిరూఁ... మస్త్ గగన్ మే
ఆజ్ మై ఆజాద్ హూ...
దునియాకే చమన్ మే....
తండ్రి ఉన్నట్టుండి కన్నుమూస్తే ఇంటిని మోసే బాధ్యత లతా మీద పడింది. ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు, తల్లి.... గొంతులో పాట తప్ప తినడానికి మరేమీ లేని పేదరికమూ. వాళ్లను పోషించడానికి లతా రోజూ ఒక గొడుగు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగేది. అవకాశాల కోసం అర్థించేది. నూర్జహాన్, రాజ్‌కుమారి, షంషాద్ బేగం, సురయ్యా, గీతారాయ్... వంటి స్టార్స్ మధ్య హిందీ వచ్చీరాని, ఉర్దూ వచ్చీరాని, నాగరీకుల భాష వచ్చీరాని ఈ మరాఠీ అమ్మాయి కాసింత ఆత్మవిశ్వాసపు ఆక్సిజన్ కోసం వెంపర్లాడింది. చివరకు సంగీత దర్శకుడు ఖేమ్‌చంద్ ప్రకాష్ తన ‘మహల్’ సినిమాలో ‘ఆయేగా... ఆయేగా’ పాటతో ఆమెను ఈ లోకం మీదకు క్షిపణిలా వదిలి పెట్టాడు. దానిని దొరకబుచ్చుకున్న మరో సంగీత దర్శకుడు సి.రామచంద్ర ఆమె చేత ‘ధీరేిసీ ఆజారీ అఖియన్‌మే’ పాడించాడు. శంకర్ జైకిషన్‌లు ఊరుకోక ‘జియా బేకరార్ హై’... అనిపించారు.

అంతటితో లతా అందరినీ తోసి ముందుకు వచ్చి నిలబడింది.

ఆపైన నౌషాద్, మదన్‌మోహన్, ఎస్‌డి బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్... ప్రతి ఒక్క సంగీతదర్శకుడు తమ బాణీలను ఆమె పాదాల దగ్గర పెట్టి పునీతులయ్యారు.

కుఛ్ దిల్ నే కహా- కుచ్‌భీ నహీ
కుఛ్ దిల్‌నే సునా- కుచ్ భీ నహీ....
ఇక రఫీ, ముఖేష్, కిశోర్‌కుమార్ రంగంలో దిగారు. లతా గళానికి తమ గళం చేర్చి యుగళగీతాల మకరందాన్ని కుమ్మరించారు.

తేరి బిందియా రే-
రే ఆయ్ హాయ్- తేరి బిందియారే...
మన్నా డేతో- ఏ రాత్ భీగీ భీగీ తక్కువా? తలత్, హేమంత్ కుమార్, సురేష్ వాడ్కర్, ఏసుదాస్, బాలసుబ్రహ్మణ్యం.... అందరూ ఆమె పాటకు బోయీలైనవారే. వంతపాడినవారే.
సాధారణంగా అందరూ ఎవరెస్ట్ ఎక్కుతారు. ఎవరెస్ట్ ఉంది కనుక ఎక్కుతారు.
కాని, లతా తనే ఎవరెస్ట్‌గా మారి, ఆపైన తానే దానిని అధిరోహించింది.
శిఖరమే లతా. లతే శిఖరం.
ఆమెకు జయం. ఆమెకే జయం.

రజనీగంధా ఫూల్ తుమ్హారే....
లతాకు మంచి పాటలు యిచ్చిన సంగీతదర్శకుడిగా మదన్‌మోహన్ పేరు చెబుతారు. కాని సలీల్ చౌధురి ఆమెకు చాలా విలువైన పాటలు కానుకగా యిచ్చాడు. రజనీగంధా పాటతో పాటు ఛోటీసీ బాత్‌లోని ‘నజానే క్యూ’... అద్భుతం.


హవామె ఉడ్‌తా జాయే... మొర లాల్ దుపట్టా మల్‌మల్‌కా....
బర్‌సాత్
లతా పాటలంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానం. ఆమె పాటల్లో నాకు నచ్చినవి చాలా ఉన్నా బర్‌సాత్‌లోని ‘హవామె ఉడ్‌తా జాయే’... పాట చాలా యిష్టం. దాని చిత్రీకరణ కూడా బాగుంటుంది. బర్సాత్ చిత్రం సంగీతదర్శకులైన శంకర్ జైకిషన్‌తో పాటు లతాకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఏమైనా ఆ సినిమాలూ ఆ పాటలూ ఆ కాలం, మా కాలం వేరు.
-పి.సుశీల, గాయని

రసిక్ బలమా....
చోరీచోరీ
ఈ పాట చుట్టూ ఎన్ని జ్ఞాపకాలు. మావారు రామప్రసాద్ నేను ఈ పాట పాడుతుండగానే విని నా ప్రేమలో పడ్డారు. లతా పాడిన ఈ పాటను నేను చాలా యిష్టంగా పాడేదాన్ని. ఏవిఎం స్టూడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఉద్యోగం కోసం నన్ను ఆడిషన్‌కు పిలిచినప్పుడూ మా వారు కోరగా ఇదే పాట పాడాను. వెంటనే సెలెక్ట్ అయ్యాను. ఎవరో కొత్త అమ్మాయట లతా పాట బాగా పాడిందట అని మద్రాస్‌లో టాక్ వస్తే తమిళ భాషలో మొదట అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తిలక్ గారి సినిమాలో ‘నీ ఆశ అడియాస’ మొదటగా పాడాను. లతాతో నాకు పరిచయం తక్కువ. కాని తన సిల్వర్ జూబ్లీకి నన్ను ఆహ్వానించారు. నేను ఒకసారి బాంబేకి కచ్చేరి ఇవ్వడానికి వెళ్లి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆమె నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను పాడిన ‘నీ లీల పాడెద దేవా’... పాట రికార్డు తన దగ్గర ఉన్నట్టు చెప్పారు. లతా ఏం పాడినా బాగుంటుంది. ఆమె ఏ పాటైనా బాగుంటుంది. రసిక్ బలమా... యింకా రసాలూరుతూ ఉంటుంది.
-ఎస్.జానకి, గాయని

తూ జహా జహా చలేగా... మేరా సాయా సాత్ హోగా...
మేరా సాయా
మదన్‌మోహన్ మ్యూజిక్ డెరైక్షన్‌లో లతా పాడిన ఈ పాట నా ఆల్‌టైమ్ ఫేవరెట్. ఉదయ్‌పూర్ లేక్ ప్యాలెస్‌లో తీసిన ఈ పాట చూడ్డానికి వినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. పాటలు చాలామంది పాడతారు. కాని లతా గొంతులో ఉండే క్లుప్తత, స్పష్టత, నిర్దిష్టత చాలా అరుదు. అది ఆమె ప్లస్ పాయింట్. లతాగారిని ఒక్కసారే కలవగలిగాను. అదీ... హైద్రాబాద్‌లో ఘంటసాల గారి విగ్రహం స్థాపించినప్పుడు. బాలూగారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె చేతుల మీద మెమెంటో తీసుకున్నాను.
-కీరవాణి, సంగీత దర్శకుడు

దిల్ క దియా జలాకె గయా... ఏ కౌన్ మెరీ తన్హాయీ మే....
ఆకాశ్ దీప్...
లతా పాటలు లక్ష ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ మాత్రం ‘దిల్ క దియా’... మాత్రమే. ‘నిమ్మీ’ మీద తీశారా పాటని. చిత్రగుప్త సంగీతం. లతా దీనిని ఎలా పాడాలంటే దాదాపు చెవిలో గుసగుసగా వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పాటంటే నాకు పిచ్చి. అందుకే నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అగ్నిప్రేవేశం’లో కూడా దీనిని ఉపయోగించాను. నేను రాసిన ‘ఆఖరిపోరాటం’ కోసం బాలూతో లతా డ్యూయెట్ పాడారు. వేటూరి రాసిన పాటకు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అడిగారామె. ఎందుకండీ అన్నాన్నేను. పాట భావం తెలుసుకోకుండా ఎలా పాడటం అని ప్రశ్నించారామె. ఇవాళ రకరకాల భాషల నుంచి వచ్చి, పాట భావం తెలుసుకోకుండా పాడేసి వెళుతున్న అనేక మంది గాయకులు ఈ ముఖ్య విషయాన్ని లతా నుంచి నేర్చుకోవాలి.
- యండమూరి వీరేంద్రనాథ్, రచయిత

ఆజారే మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్...
మధుమతి
నాకు లతా అనగానే ఎప్పుడూ గుర్తొచ్చే పాట యిది. సలీల్ చౌదురి సంగీతంలో ‘మధుమతి’ కోసం ఆమె పాడిన ఈ పాట ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేదు. దీని రాగం ‘పహాడీ’ అనుకుంటాను. లతా గారితో మరో గొప్ప జ్ఞాపకం కూడా ఉంది. అదేమిటంటే ఒకసారి ఏదో పని మీద లతా మద్రాసు వచ్చారని తెలియగానే ఇళయరాజా వెంటనే నన్ను పిలిపించి ఏదైనా పాట రికార్డు చేద్దామన్నారు. వెంటనే నేను అప్పుడు నేను తీయాలనుకున్న ‘గాలికొండపురం రైల్వేగేటు’ సినిమా కోసం ఆమెతో ఒక పాట పాడించి రికార్డు చేశాను. లతాతో పాటు ఆమె చెల్లెలు ఉషా కూడా వచ్చారు. ఆ సినిమా నేను తీయలేదు. కాని ఆ పాట యింకా నా దగ్గరే ఉంది. ప్రజలకు చేరడం మధుమతిలానే ఎదురుచూస్తూ ఉంది.
- వంశీ, దర్శకుడు

కుచ్ నా కహో.. కుచ్ భీ నా కహో...
1942 ఏ లవ్‌స్టోరీ
మై గాడ్.. లతా గురించా? ఆమె గురించి మాట్లాడేంత పెద్దవాణ్ణా నేను. కాని ఆమె పాటలంటే ఎవరికి యిష్టం ఉండదు? నా లాంటి సంగీత దర్శకుడికి ఆమె గొంతే ఒక ఇన్‌స్పిరేషన్. ఆర్‌డి బర్మన్ సంగీతంలో లతా పాడటం కొంచెం తక్కువ. కాని అదే ఆర్‌డి బర్మన్ దర్శకత్వంలో 1942 ఏ లవ్‌స్టోరీ కోసం ఆమె పాడిన కుచ్ నా కహో... అద్భుతం. ఎన్ని సార్లు విన్నానో. ఆ పాట గొప్పదనం గురించి ఏం చెప్పమంటారు చెప్పండి.
- దేవిశ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు

అజీబ్ దాస్‌తాఁ హై ఏ.....
దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయే....
నేను మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఎక్కువగా రాజస్తాన్‌లో పెరిగాను. అక్కడ ఉన్నంతకాలం నాకు హిందీ పాటలు ముఖ్యంగా లతా పాటలే కాలక్షేపంగా ఉండేవి. నాకు హిందీ సినిమాలలో షోలే అంటే ఎంత పిచ్చో లతా పాటలు కూడా అంతే పిచ్చి. దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయేలో అజీబ్ దాస్‌తా హై ఏ పాట చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు హమ్ చేసుకుంటూ ఉంటాను.
- రవితేజ, సినీనటుడు

తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్‌మే...
షిన్‌షినాకి బబ్లాబూ
లతా రానంత వరకు సంగీత దర్శకులు పాడుకుంటూ నటించే హీరో హీరోయిన్ల పరిమితులకు లోబడి పాటలు ట్యూన్ చేసేవారు. లతా వచ్చాక ఆ శృంఖలాలు తెంపేసింది. మ్యూజిక్ డెరైక్టర్‌లు లతా ఉందనే ధైర్యంతో పాటను తమకు కావలసిన రేంజ్‌కు తీసుకెళ్లారు. ఒక వందమంది పాటల రచయితల పాటలు, అవి ఎంతో గొప్పగా ఉన్నా, కేవలం లతా పాడటం వల్ల మరో మెట్టు రాణించాయి. చాలా సాదాసీదా సన్నివేశాలు కూడా లతా పాటలోని భావావేశం వల్ల వింతపరిమళం అద్దుకొని శోభిల్లాయి. భారతదేశంలో దాదాపు 99 శాతం జనాభాకు లతా తెలుసు. లతా పాట తెలుసు. వారికి హిందీ సినిమా అంటే లతా పాటలే. ఈ కీర్తి కనీసం మరో వందేళ్లైనా ఉంటుంది.
-వి.ఎ.కె. రంగారావు, సినీ సంగీత విమర్శకులు

తగినశాస్తి

కపిలాపురంలో గోపాలం, గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. గోపాలానికి ధనాశ ఎక్కువ. అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్దమొత్తంలో ధనం అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి ఇవ్వకపోగా గోవిందం వెళ్లిన ప్రతిసారీ ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు. ఒకనాడు గోవిందం గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు?’’ అని గట్టిగా నిలదీయడంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకుం టూ అనారోగ్యం ఉన్నట్టు అభినయించసాగాడు.

అంతలో అతని భార్య లోపలి నుంచి వచ్చి ‘‘అయ్యో! అయ్యో! అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను డబ్బు కోసం పీడిస్తావా?’’ అంటూ శాపనార్థాలు పెట్టసాగింది.
గోవిందం ఇవతలికి రాగానే భార్యభర్తలిద్దరూ ‘బాగా కుదిరింది. ఇక నుంచి గోవిందం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేయాలి’ అనుకోవడం అతని చెవినపడింది.

గోవిందం కొంతకాలం తర్వాత మళ్లీ వెళ్లి డబ్బు అడగబోగా, గోపాలం ఈసారి కూడా కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు. అతని భార్య గోవిందాన్ని తిట్టడం మొదలుపెట్టింది.
వీళ్ల నాటకాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకున్న గోవిందం ఈ విషయం మొత్తం గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు.

గ్రామాధికారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం గోవిందం కొద్దిరోజుల తర్వాత మళ్లీ గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు’’ అని అడగటంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.

అప్పుడే లోపలికి వచ్చిన గ్రామాధికారి తన వెంట వచ్చిన గ్రామవైద్యుడికి సైగ చేయడంతో వైద్యుడు గోపాలం నాడిని పరీక్షించి, ‘‘అయ్యా! ఇతని పరిస్థితి ఆఖరి దశలో ఉంది. ఏవైనా ముఖ్యమైన పనులు వుంటే పూర్తి చేయడం మంచిది’’ అన్నాడు.

అంతట గ్రామాధికారి గోపాలం ఇల్లు అతని తదనంతరం అతని భార్యకు చెందాలి. భోషాణం పెట్టెలోని డబ్బు గోవిందం ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాలి’’ అన్నాడు. గోపాలానికి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషించారు.

బ్లాక్ బర్డ్ (Black Bird)

ఇవి ఆఫ్రికా, యూరప్, దక్షిణ ఆసియా, ఐలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకోగలవు.

శత్రువుల నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు గూటిలోని పిల్లలను శబ్దాలతో హెచ్చరిస్తాయి.
దీని ముక్కు నారింజరంగులో సూదిగా ఉంటుంది. కంటి చుట్టూ పచ్చని రింగులా ఉంటుంది. మిగతా శరీరమంతా నల్లని ఈకలు కలిగి ఉంటుంది. వీటిలో ఆడపక్షులకు బూడిదరంగు ఈకలు ఉంటాయి.

ఇవి సుమారు 10 అంగుళాల పొడవు, 4 ఔన్సులు బరువు ఉంటాయి. ఎక్కువగా వానపాములు, పురుగులు, పండ్లను తింటాయి. ఇవి చలికాలంలో అనువైన ప్రదేశాలకు వలసవెళ్లి తమ సంఖ్య పెంచుకుంటాయి.

చేపలు ఎలా నిద్రపోతాయి?

చేపలు మనలా కదలకుండా కళ్లు మూసు కుని విశ్రాంతి తీసు కోవు. చేపల కు కనురెప్పలు ఉండవు. చేపల శరీర కదలికలు తక్కువగా ఉండి విశ్రాంతి తీసుకునే స్థితి కనపడుతుంది. చేపలకు సంబంధించి ఇదే నిద్ర అనుకోవాలి. విశ్రాంతి దశలో చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోవు.

అక్వేరియంలో ఉండే చేపలు విశ్రాంతి తీసుకునేటపుడు ఆహారం వేస్తే చాలా ఆలస్యంగా స్పందిస్తాయి. కొన్నిరకాల చేపలు రాత్రులు విశ్రాంతి తీసుకుని పగలు చురుగ్గా ఉంటే, మరికొన్ని పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి చురుగ్గా ఉంటాయి. కొన్నిరకాల షార్క్‌లు నిద్రలో కూడా ఈత కొడతాయి. కార్ప్ చేపలు బురదలో నిద్రపోతాయి. ఆఫ్రికన్ లాంగ్‌ఫిష్ శ్వాస తీసుకోవడానికి చిన్నరంధ్రం ఉంచుకుంది.

కారం తింటే ముక్కు నుంచి నీరెందుకు వస్తుంది?

వంటలో కాస్తంత కారం ఎక్కువైనా నోరు మండడంతోబాటు ముక్కులోంచి నీళ్లు వస్తాయి. కారం లేదా ఇతర మసాలా దినుసుల్లో ఉండే కాప్సైసిస్ అనే రసాయనం దీనికి కారణం. మెదడు నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల ముక్కులోంచి నీరు వస్తుంది.

మనం మంచినీరు తాగినా మంట తగగకపోవడానికి కారణం ఈ రసాయనం నీటిలో కరగకపోవటమే. ఈ లక్షణం మిరియాల్లో కూడా ఉంటుంది. జలుబు చేసినపుడు చాలా ఇళ్లల్లో మిరియాలు వాడడం చూస్తూనే ఉంటాం. దీని ప్రభావంతో ముక్కులో గడ్డకట్టిన చీమిడి లాంటి పదార్థం కరిగి నీరుగా కారిపోతుంది.

కప్పలు నీళ్లు తాగుతాయా?

కప్పలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయన్నది తెలిసిందే. అందువల్ల అవి నీళ్లు ఎక్కువ తాగుతాయని అనుకుంటూంటాం. నిజానికి కప్పలు మనుషుల్లా నీళ్లు తాగవు. కానీ అవసరమయిన నీటిని శరీరం ద్వారా శోషించుకుంటాయి. అలాగే చర్మం ద్వారా కావలసిన ఆక్సిజన్‌ను శోషించుకుంటాయి.

అయితే పెద్దకప్పల్లో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కప్పపిల్లలు మొప్పల ద్వారా శ్వాస పీల్చుకుంటాయి. కప్పలు ఎక్కువుంటే వర్షాలు పడతాయన్న భావన చాలా దేశాల్లో ఉంది. వర్షాలకోసం కప్పల పెళ్లిళ్లు కూడా చేస్తుంటారు!

వీణ (Veena)

కర్ణాటక సంగీతంలో ఉపయోగించే ప్రధాన సంగీత వాయిద్యం వీణ. వీణకు ఏడుతంత్రులు ఉంటాయి. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమమనే నాలుగు తంత్రులు బిగించబడి ఉంటుంది.

ఇవేగాక శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులు బిగిస్తారు.

వీణ వాయించేటపుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చిన 24 మెట్లు(స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమచేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.

వీణలో ప్రధానంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
వీణల తయారీకి మన రాష్ట్రంలోని విజయనగరంజిల్లా బొబ్బిలి సుప్రసిద్ధం. ఇక్కడ 17వ శతాబ్ది నుంచే వీణల తయారీ జరుగుతోంది.

వీణ ల్లో రుద్రవీణ, చిత్రవీణ, విచిత్ర వీణ, సరస్వతీ వీణ అనే రకాలున్నాయి.
సంగీత త్రిమూర్తుల్లో ముత్తుస్వామి దీక్షితార్ వీణవిద్వాంసులుగానూ సుప్రసిద్ధులు.

వయొలిన్ (Violin)

దీనినే ఫిడేలు అంటారు. ఇది తంత్రీవాద్యం.వయొలిన్‌లో ప్రధానభాగాన్ని చెక్కతో తయారుచేస్తారు. ఈ భాగం కారణంగానే తంత్రులు చేసే శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది.
ప్రారంభంలో వయొలిన్‌లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారుచేసేవారు.

కర్ణాటక సంగీతంలో దీనిని ప్రధాన తంత్రీవాయిద్యంగా ఉపయోగిస్తారు. వయొలిన్‌పై కమానుతో వాయిస్తారు. కమాను అనేది చిన్నపాటి కర్ర. దీనికి గుర్రపు తోక వెంట్రుకలు తీగెలుగా ఉంటాయి. దీన్ని కుడి చేతితో ఒక చివర పట్టుకుని వయొలిన్ తీగెలపై అడ్డంగా కమానును ఒక చివరి నుంచి మరో చివరికి రాస్తూంటారు.వయొలిన్ అనగానే మనకు స్ఫురించేది ద్వారం వెంకటస్వామినాయుడుగారి పేరు.

వల్లంకి పిట్ట (Common Snipe)

ఇవి పశ్చిమ యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలలో ఎక్కువగా కనబడుతూంటాయి. వేరే ప్రాంతాలకు వల సపోతూంటాయి. అక్కడ చలికాలంలో మరింత దక్షిణంగా వెళతాయి.

బూడిద, నలుపు రంగుల్లో చీర డిజైన్‌లా శరీరమంతా ఉంటుంది. తలమీద ఉడతలాగ రెండు లేదా మూడు గీతలు ఉంటాయి.

ఎగిరే సమయంలో ఒకేవైపు నేరుగా వెళ్లదు. కొంతదూరం నేరుగా ఆ తర్వాత పక్కలకు తిరిగి కొంతసమయం తర్వాత నేలకు దగ్గరగా వంకర టింకరగా వెళుతూంటుంది.

ఇవి 4.5 ఔన్సుల బరువు, 11 అంగుళాల పొడవు ఉంటాయి.వీటి రెక్కలు 5 అంగుళాలు విచ్చుకుంటాయి.

ఇవి ఏప్రిల్, జూలై మధ్యకాలంలో 4 వరకూ గుడ్లుపెడతాయి.ఇవి ప్రధానంగా కీటకాలు, పురుగులు, కప్పల్ని తింటాయి.

కంజీర

కర్ణాటక సంగీత కచేరీల్లో మృదంగానికి తోడుగా వాయించే వాయిద్యం కంజీర. కంజీరాను 1890ల్లోనే వాయిస్తుండేవారు. 1930లో సంగీత కచేరీల్లో తోటి వాయిద్యంగా ప్రవేశపెట్టారు.

ఇది గుండ్రంగా 7 నుంచి 9 అంగుళాల వెడల్పు, 2 నుంచి 4 అంగుళాల లోతు ఉంటుంది.
చూడ్డానికి మూతలాగ ఉంటుంది. దీన్ని జంతుచర్మంతో తయారుచేస్తారు. వెదురు లేదా కొయ్యతో గుండ్రంగా ఉన్న ఫ్రేమ్‌కి ఒక వైపు చర్మాన్ని గట్టిగా బిగిస్తారు.

ఫ్రేమ్‌కి మూడు లేదా నాలుగు పాత చిల్లు నాణాలు ఏర్పాటుచేస్తారు. ఇతర చర్మ వాయిద్యాల వలె కంజీరాను వాయించడం అంత సులభం కాదు. దీన్ని కుడి అరచేయి, వేళ్లతో వాయిస్తారు. ఎడమ చేయిని డ్రమ్‌కు మద్దతుగా ఉంచాలి. శబ్దాన్ని ప్రత్యేకించి నియంత్రించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితులను అనుసరించి కంజీరా పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

మృదంగం

మృదంగం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాద్యం. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుందని పురాణాలు చెబుతాయి.

ఈ వాద్యం ఒక గొట్టపు ఆకారంలో ఉండి ఇరువైపులా వాయించడానికి అనువుగా ఉంటుంది.

ఇది హిందూసంస్కృతిలో కచేరీలలో ముఖ్యభాగంగా అన్ని కార్య్రకమాల్లోనూ ఉపయోగించే ప్రధాన వాయిద్యం.

మంచి బలమైన చెట్టు కాండం నుంచి పొడవైన భాగాన్ని తీసుకుని దానిలో మధ్యభాగాన్ని తొలగించి డొల్లగా చేస్తారు.

ఎండబెట్టిన తోలును గుండ్రటి రింగులాంటి దానికి చుట్టి బిగిస్తారు. ఆ తోలుకి రింగులు అనుసరిస్తూ చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు.

దీన్ని కావలసిన విధంగా చర్మాన్ని వేడి చేసుకుంటూ తాళ్లను బిగించుకుంటూ ధ్వని సరియైన శ్రుతిలో వచ్చేలా సరిచేస్తాడు.

మృదంగవాయిద్యంలో పాల్‌ఘాట్ మణిఅయ్యర్, దండమూడి రామమోహనరావు, యెల్లా వెంకటేశ్వరరావు తదితరులు ఎంతో సుప్రసిద్ధులు.

మోటార్ వాహనాల్లో ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడతారు?

ఏదైనా ఒక వస్తువుని మరొక వస్తువుపై ఉంచి లాగినా, పక్కకు నెట్టినా ఒక దానితో మరొక దాన్ని రుద్దినా ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ వాటి ఉపరితలాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణబలం ఎప్పుడూ వస్తువు గమనాన్ని వ్యతిరేకిస్తుంటుంది. అందువల్ల మోటార్ వాహనాల్లో లేదా సైకిల్ చక్రం ఇరుసు వద్ద బేరింగ్స్ వాడతారు. దీనికి కారణం వాటిలోని లోహపు గుండ్లు దొర్లటంవల్ల ఘర్షణ వీలైనంత తగ్గడమే.

కదిలే చక్రాల్లో లేదా ఇంజన్‌లో, పిస్టన్ వద్ద చలనంలో ఉన్న రెండు తలాల మధ్య రాపిడి వల్ల ఘర్షణ పుట్టి ఇంజన్ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి యంత్రాల కదిలే భాగాల్లో, వాహనాల ఇంజన్‌లలో, చక్రాల్లో కందెనగా గ్రీజ్, ఆముదం వంటి నూనెలను వాడతారు. పిస్టన్ కదులుతున్నప్పుడు ఆ కందెన సన్నని పొరగా ఏర్పడి ఘర్షణని తగ్గిస్తుంది. దాంతో ఇంజన్ సామర్థ్యం పెరిగి ఎక్కువకాలం పనిచేయగలదు.

పొటాషియమ్ ప్రాధాన్యం తెలుసా...?

మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి... ఏం జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం జరగదు. అంటే... మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు... అసలు కదలడమే సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు అర్థం కాదు కూడా! ఎందుకంటే... మెదడులోని కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్ కావాల్సిందే.

పైగా రక్తపోటును క్రమబద్ధీకరించే గుణం దీనికి ఉంది. మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. ఒక అవకాడోలో 500 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. కానీ ఇది అందరికీ అంతగా అందుబాటులో ఉండదు. ఇక పై రెండూ అందుబాటులో లేకపోతే పొటాషియమ్ కోసం బంగాళాదుంప (ఆలుగడ్డ) మీద ఆధారపడండి. ఒక పెద్ద ఆలుగడ్డలో 1600 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది.

ప్రో-బయాటిక్స్ మజ్జిగే మందుగా...

మజ్జిగే మందెలా అవుతుంది?

మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’ అంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో-బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ చేసుకుంటాం. అలాగే దోసె పిండి కలుపుకుని కాస్తంత పులిసిపోయాకే అట్లు వేసుకుంటాం. ఎండన పడి వచ్చిన వారికి మజ్జిగ ఇస్తాం. ఇలా మనం మజ్జిగను తాగినప్పుడు కూడా మనకు మేలు చేసే అనేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. అంటే మజ్జిగరూపంలో మనం ఒకవైపు ఎండ దెబ్బ వల్ల వచ్చే డీ-హైడ్రేషన్‌ను నిరోధించుకుని, మరోవైపు పేగులకు మేలు చేసే సూక్ష్మజీవులనూ సమకూర్చుకుంటామన్నమాట. ఇలా మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో ‘ప్రో-బయాటిక్స్’ను తీసుకునే అలవాటు ఎప్పట్నుంచో మనకు ఉంది. మనం మజ్జిగలా తీసుకునేదాన్నే ఇప్పుడు చాలామంది మందులా కూడా ఉపయోగిస్తున్నారు.

ఏయే జబ్బులకు...

పైన పేర్కొన్నట్లుగా రుక్మిణికి కలిగిన సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. ఇదిగాక అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధిలోనూ, క్రోన్స్ డిసీజ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్‌లో పెద్దపేగు, రెక్టమ్ (మలద్వారం పై భాగం) వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు గురవుతాయి. ఇక క్రోన్స్ డిసీజ్ ఉన్నవారిలోనైతే జీర్ణవ్యవస్థ ఏ భాగంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులను కలిపి ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్’గా వ్యవహరిస్తుంటారు.

ఎందుకొస్తాయి ఈ సమస్యలు...?

ఇరిటబుల్ బవెల్ డిసీజ్‌లు ఎందుకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కొంతమంది అయితే ఇవి మానసిక సమస్యల వల్ల కనిపించే శారీరక లక్షణాలని సిద్ధాంతీకరించారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే వారికి ఈ జబ్బులు వస్తుండటం గమనించారు.

తగ్గడానికి ఏం చేయాలి...?

ఉదయం తినే టిఫిన్లలో పాశ్చాత్య తరహా ఆహారాలు కాకుండా మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె వంటివాటిని తీసుకోవాలి. తరచూ తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్తంత పులిశాక తాగితే అందులో సూక్ష్మజీవులు పెరగవచ్చేమోగాని... అప్పటికే తాజా మజ్జిగ తన క్షారగుణాన్ని కోల్పోయి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది. అప్పటికే మన జీర్ణవ్యవస్థలో అసిడిటీ ఉంటే... ఆ యాసిడ్‌కు... ఈ ఎసిడిక్ మజ్జిగ తోడై సమస్యను పెంచుతుంది. అందుకే తాజా మజ్జిగ తాగాలి. లేదా తియ్యటి పెరుగులోనూ ప్రో-బయాటిక్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకునే రిఫైన్‌డ్ షుగర్స్, జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. వీలుకాకపోతే గణనీయంగానైనా తగ్గించాలి. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం పొట్టుతో ఉండే అన్ని ధాన్యాలనూ తీసుకోవచ్చు కానీ కొంతకాలం పాటు మొక్కజొన్న, గోధుమలనుంచి మాత్రం దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలతో మన పేగుల్లోకి పుష్కలంగా పీచు వెళ్లేలా చేసుకోవాలి. అప్పటికీ గుణం కనిపించకపోతే డాక్టర్‌లను అడిగి ఇప్పుడు టాబ్లెట్లు, కాప్సూల్స్, పౌడర్లు, సోయాబీవరేజెస్ రూపంలో లభ్యమవుతున్న ప్రోబయాటిక్స్ మందులు వాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

జంక్ అంటే జంకండి!

మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం. కానీ అందులోని హానికరమైన అంశాలను గుర్తించి విచక్షణతో మెలగాలి. మనం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు వాటితో కలిగే హానిని కూడా గ్రహిస్తే వాటిని పరిమితం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం. అలాంటి విచక్షణను కలిగించేందుకే ఈ కథనం.

మనం ఆహారం కోసం ఏదో తింటుంటాం. అదే సమయంలో రుచిగా ఉండాలని కూడా కోరుకుంటాం. పిజ్జా, బర్గర్, పఫ్స్, చిప్స్ లాంటివి చాలా త్వరితంగా లభ్యమవుతున్నాయి. పైగా రుచి కూడా. అలాంటప్పుడు వాటిని తింటే తప్పేమిటి అనుకోకండి. వాటిని ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థం దీర్ఘకాలం నిల్వ ఉండటానికీ, మరింత రుచిగా ఉండటానికి కొన్ని ప్రక్రియ (ప్రాసెస్)లను అనుసరిస్తాం. ఆ ప్రాసెస్‌ల వల్ల రుచి, చాలాకాలం నిల్వ ఉండే శక్తి (షెల్ఫ్‌లైఫ్) లభిస్తాయి. ఒక పదార్ధాన్ని నూనెతోనో, లేదా నేతితోనో చేస్తే త్వరగా చెడిపోవచ్చు. అందుకే అందులో దీర్ఘకాలం నిల్వ ఉంచే పదార్థాలు వాడతారు. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటారు. ఇలా నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాల మీద ఆధారపడాల్సి వస్తుంటుంది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో అందులోని స్వాభావిక పోషకాలతో ఎలాంటి హానీ లేకపోయినా... ఈ రసాయనాలే ప్రమాదకారి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో చాలాకాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటిని కాస్త ఆలోచించి తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

ఆహారాన్ని నిల్వ ఉంచేలా చేసే ఆ నూనె ఏమిటి?

స్వాభావికమైన వెన్న వాడితే దానితో చేసిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది. కానీ వెన్న త్వరగా చెడిపోతుంది. అలా చెడకుండా ఉండే పదార్థం ఏదైనా ఉండి, అది వెన్నలాంటి రుచి ఇస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిన పదార్థమే హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇందులో మామూలు వంటనూనె (వెజిటబుల్ ఆయిల్)ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి, అందులోకి హైడ్రోజెన్‌ను పంపుతారు. దీన్నే హైడ్రేజనేషన్ అంటారు. దాంతో నూనె కాస్తా వెన్నలాంటి పదార్థంగా మారిపోతుంది. వెన్నలాంటి రుచే ఇస్తుంది. ఇక్కడ ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంటుంది. ఒకటి... నూనె ద్రవరూపంలో ఉంటే దాన్ని వాడుకోవడం ఒకింత కష్టం. దూరం తీసుకెళ్లాలంటే ఒలికిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఘనరూపంలో ఉంది. కాబట్టి ఒలికిపోయే ప్రమాదం లేదు. ఫలితంగా నిల్వకూ, రవాణాకూ, వాడుకోడానికీ చాలా సులభం. ఇక రెండో ప్రయోజనం... ఇది స్వాభావికమైన దానికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

వెన్నలో ఏముంది.. మరి వెన్నలాంటిదాంట్లో ఏముంది?

వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వీటితో పాటు బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. బ్యుటిరేట్ మానసిక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. తిన్న ఆహారమంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్నపేగుల్లో వాపు, నొప్పి, మంటల (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యానికి మంచిది. వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న ఎంతో ఉపయోగం. అంటే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మరి వెన్నలాంటి ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్‌లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చే గుణాలున్నాయి. ఇది గుండెకు మంచిది కాదు, శరీరంలోని కొవ్వును పెంచుతుంది. ఫలితంగా స్థూలకాయాన్ని కలిగిస్తుంది. పైగా ఇది క్యాన్సర్ కారకం కూడా.

అలర్జీలూ... మానసిక వ్యాధులు

మనం ఆహారంలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌లో చాలా వరకు రసాయన పదార్థాలే కావడంతో ఒక్కోసారి అవి శరీరానికి సరిపడకపోవడం వల్ల అవి తీసుకున్న వారిలో అలర్జీలు కలగడం మామూలే. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్ ఎక్కువగా ఉండటానికి చేసే రకరకాల ఆహారాలతో పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే మానసిక వ్యాధి రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్న అంశం.

ఎర్రగా ఊరిస్తోందా...? ఒక్క క్షణం ఆగండి...

మీరు ఏదైనా బేకరీలోకి వెళ్లినప్పుడు అందులో నిల్వ ఉన్న చికెన్ ఐటమ్ ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించిందా? అది మరీ ఎర్రగా ఉందంటే దానికి సోడియమ్ నైట్రేట్‌పాళ్లు ఉన్న ప్రిజర్వేటివ్ కలిపారని అర్థం. చికెన్ మంచి పోషకమే అయినా దాంతోపాటు జత కలిసి ఉన్న సోడియమ్ నైట్రేట్ కారణంగా అది కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ల్యూకేమియాలను కలిగించే పదార్థంగా మారుతుంది. అందుకే ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార బేకరీ పదార్థాలను తక్కువగానే తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఆహారాలుంటే వాటిని మానేసి ఏ శాండ్‌విచ్‌వైపో మొగ్గుచూపాలి. (అప్పుడు శాండ్‌విచ్‌లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్‌కు బదులు స్వాభావికమైన వెన్న వాడిన వాటినే తీసుకోవాలని గుర్తుంచుకోండి).

కూల్‌డ్రింక్స్‌లోని కృత్రిమ రంగులు - ప్రిజర్వేటివ్స్

మనం కూల్‌డ్రింక్స్ తాగే సమయంలో వాటితో పాటు కొన్ని కృత్రిమ రంగులనూ బలవంతంగా శరీరంలోకి పంపుతాం. వాటిని అక్కడ ఉంచడానికి మన మూత్రపిండాలు అస్సలు ఒప్పుకోవు. అందుకే వీటిని బయటకు పంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల దెబ్బతింటాయి. ఇక కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాలు దోహదపడతాయి. అవే... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్. కొన్ని సందర్భాల్లో సన్‌సెట్ ఎల్లో, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్, సోడియ మ్ బెంజోయేట్ వంటి అనేక రసాయనాల మిశ్రమాన్ని ఒకే ప్రిజర్వేటివ్స్‌గా కూడా వాడతారు. వీటివల్ల పిల్లలకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

ఉదాహరణకు... సోడియం బెంజోయేట్ అనే రసాయనం మనం తీసుకున్న విటమిన్ ‘సి’తో కలిసినప్పుడు ఇది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. బాగా వయస్సు పైబడటం లేదా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సోడియమ్ బెంజోయేట్ తీసుకున్న వారిలోనూ అచ్చం అలాంటి దుష్పరిణామాలే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని ఇటీవలి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ను రూపొందించడానికి విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే అప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు గణనీయంగా తగ్గవచ్చు. అప్పటివరకూ మనం ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా అప్రమత్తంగా ఉంటూ పరిమితంగా తీసుకోవడం తప్పదు.

కూల్‌డ్రింక్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్‌తో: దీనివల్ల దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతింటుంది. దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఈ పొర దెబ్బతినడం, పళ్లపై మరకలు, చారలు ఏర్పడటం ఇప్పటికే కనిపిస్తున్న అనారోగ్యకరమైన పరిణామం. కూల్‌డ్రింక్స్ కంపెనీలు మాత్రం తమ పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ కేవలం అనుమతించిన మోతాదుల (పర్మిసిబుల్ లిమిట్స్)కు మించకుండా వాడుతున్నామని చెబుతుంటాయి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల అది క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుంది. దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అందుకే బేకరీలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని మీరు తీసుకోబోయే ఆహారాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

ఉప్పు కూడా ఒక ప్రిజర్వేటివే...

మనం ఆహారంలో తీసుకునే ఉప్పు కూడా ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో ఒక ప్రిజర్వేటివ్‌గా వాడతారని మీకు తెలుసా? ఉప్పు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు... మనకు బాగా తెలిసిన ఉదాహరణ రక్తపోటు మాత్రమే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఉప్పు ఎక్కువగా వాడితే జీర్ణాశయం లోపలి గోడలపై ఉన్న పొరలు దెబ్బతింటాయి. ఫలితంగా అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వంటి జబ్బులూ రావచ్చు. మనం వాడే ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అప్పడాలు, ఊరగాయలు (పచ్చళ్లు)... వీటన్నింటిలోనూ ఉప్పు ఎక్కువ. అందుకే వాటిని తక్కువగా తీసుకోవాలి.

కలుషితాహారం తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటమో లేదా ఓఆర్‌ఎస్ తీసుకుంటూ ఉండటమో చేస్తూ మీ శరీరం లవణాలనూ, నీటిని కోల్పోకుండా చూసుకోండి.

వాంతులు, విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే సాధారణంగా దొరికే యాంటీ-వామిటింగ్ అండ్ డయేరియా మందులను డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఆన్ కౌంటర్ మెడిసిన్ వద్దు.

వాంతులు, విరేచనాలు సాధారణ యాంటీ వామిటింగ్ అండ్ డయేరియా మందులతో తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించడం వంటివి చేస్తారు.

వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట లభించే పాల ఉత్పాదనలు వాడవద్దు.

చిన్న పేగు... పెద్ద విధులు

చిన్నపేగు పేరుకు మాత్రమే చిన్న. కానీ దాని బాధ్యతలు మాత్రం చాలా కీలకం. మనకు కావలసిన ఆహారం అంతా అదే జీర్ణం చేయడమే కాదు... ఒంటికి పట్టేలా చేస్తుంది. పేరుకు అది చిన్న పేగే అయినా దాని పొడవు 20 అడుగులకు పైమాటే! పైగా జీర్ణవ్యవస్థ మొత్తానికి అదే పొడవైన భాగం. ఇటీవల ఢిల్లీలో రేప్‌కు గురైన మహిళకు అంతర్గత అవయవాల్లో దెబ్బతిన్న మిగతా భాగాలన్నింటినీ ఎలాగోలా పనిచేయించగలిగినా పేగులు తొలగించాల్సి రావడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అలాంటి చిన్నపేగుల పనితీరును, వాటి ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.

చిన్నపేగులో ముఖ్యంగా మూడు ప్రధాన భాగాలుంటాయి. అవి... డియోడినమ్, జిజినమ్, ఇలియమ్.

పూర్తిగా పెరిగిన వ్యక్తి తాలూకు చిన్నపేగుల సరాసరి పొడవు 6.9 మీటర్లు (22 అడుగుల 6 అంగుళాలు) ఉంటుంది. అదే మహిళల్లో అయితే దీని సగటు పొడవు 7.1 మీటర్లు ఉంటుంది. (ఉజ్జాయింపుగా 23 అడుగుల 4 అంగుళాలు). మనుషుల ఒడ్డూ పొడవుల్లోలాగే దీని పొడవుల్లోనూ తేడాలుంటాయి. అంటే వీటి పొడవు రేంజ్... 4.6 మీటర్ల (15 అడుగుల) నుంచి 9.8 మీటర్ల (32 అడుగుల) వరకు ఉండవచ్చు.

చిన్నపేగు బాధ్యతలు... మనలో జీర్ణం అయిన ఆహారం తాలూకు పోషకాలను ఒంటికి పట్టేలా చేసే ప్రధాన బాధ్యత చిన్నపేగులదే. జీర్ణవ్యవస్థలో చిన్నచిన్న ముక్కలుగా జీర్ణమైన ఆహారం కాస్తా చిన్నపేగుల్లోకి వచ్చేసరికి దాదాపు ద్రవపదార్థంలా మారి వాటిలోనుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ద్రవం చిన్నపేగుల లోపలి ఉపరితలంలో ఉండే సన్నటి రక్తనాళాల ద్వారా ఆహారంలోని పోషకాలన్నీ శరీరంలోకి శోషితం కావడం (ఇంకిపోవడం) జరుగుతుంది.

ఈ శోషితమయ్యే భాగాన్ని పెంచడం కోసం చిన్నపేగుల లోపలి భాగాలు నున్నగా కాకుండా... ఎన్నో ముడుతలు పడ్డట్లుగా ఉంటుంది. చిన్నపేగుల నుంచి జీర్ణమైన ఆహారం, నీరు, విటమిన్లు, లవణాలు, కొవ్వులు, మనం తిన్న మందులు... ఇవన్నీ శరీరంలోకి మనం ఆహారం తీసుకున్న మూడు నుంచి ఆరుగంటల వ్యవధిలో కలుస్తాయన్నమాట. మనం తాగిన నీటిని కూడా చిన్నపేగులు శరీరానికి అందజేస్తాయి.

సాధారణంగా ప్రతిరోజూ తొమ్మిది లీటర్ల నీరు చిన్నపేగు ద్వారా బయటకు వెళ్తుంటుంది. మనం నోటినుంచి తీసుకున్న నీటితో పాటు... మనలోని అంతర్గత భాగాలైన పాంక్రియాస్, బైల్‌జూస్ వంటి భాగాల్లో జీవక్రియల కోసం ఉపయోగపడ్డ నీరు కూడా చిన్నపేగుల్లోకి వచ్చి చేరుతుంది. అక్కడ ఒక్క లీటర్ మినహాయించి మిగతాదంతా శరీరంలోకి ఇంకుతుంది. అక్కడ మినహాయించిన ఒక లీటర్ నీరు చిన్న పేగుల నుంచి పెద్దపేగుల్లోకి వెళ్తుంది. పెద్దపేగుల్లోకి వచ్చిన లీటర్ నీటిలో 150 మి.లీ. తప్ప మిగతాదంతా మళ్లీ పెద్దపేగుల ద్వారా శరీరంలోకి ఇంకుతుంది.

ప్రకృతి గొప్పదనం ఇది...
మనశరీరంలో సుమారు 6 మీటర్ల పొడవుండే చిన్నపేగులో చాలా భాగాన్ని తొలగించినా మనిషి మామూలుగానే బతుకుతాడు. ఒకవేళ దీని పొడవు 200 సెం.మీ. కంటే తగ్గినప్పుడు మాత్రమే మనిషి ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. మూడింట రెండువంతుల భాగాన్ని తొలగించినప్పుడు మనిషికి అందాల్సిన పోషకాలు అందకపోవడం, విరేచనాలు కావడం (పొడవు తగ్గడంతో ఆహారం ఉండాల్సిన ప్రదేశం తగ్గిపోయిన కారణం చేత) వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని అరుదైన జబ్బుల్లో లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు... ఒకవేళ చిన్నపేగుల నిడివిలో 90 శాతం తొలగించాల్సి వస్తే అప్పుడు జీవనం కొనసాగించడం కష్టమే. తప్పనిసరిగా చిన్నపేగు మార్పిడి చికిత్స చేయాల్సి ఉంటుంది.

చిన్నపేగుల జబ్బుల వల్ల కనిపించే లక్షణాలు
చిన్నపేగులకు వచ్చే వివిధ రుగ్మతల వల్ల కనిపించే లక్షణాల్లో ముఖ్యమైనవి విరేచనాలు, దాని వల్ల కలిగే డీ-హైడ్రేషన్. ఈ కారణంగా శరీరానికి పోషకాలు అందవు. అప్పుడు కిందినుంచి గాలి పోవడం, వాంతులు, తినడం కష్టం కావడం వంటివి కనిపిస్తాయి.

ఇంటస్టినల్ ఫెయిల్యూర్ అంటే...
చిన్నపేగుల్లో ఆహారాన్ని ఇంకింపజేసుకునే శక్తి క్షీణించడాన్ని ఇంటస్టినల్ ఫెయిల్యూర్ అంటారు. ఇది పిల్లల్లో సాధారణంగా కనిపించే గట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే జబ్బుల్లో కనిపిస్తుంది. ఈ రుగ్మత వల్ల ఆహారం జీర్ణం కాదు. కొందరు పెద్దల్లో సర్జరీ తర్వాత చిన్నపేగులకు ఆహారాన్ని శోషింపజేసుకునే శక్తి క్షిణించే అవకాశాలున్నాయి.

చిన్నపేగు మార్పిడి, దాని ఉపయోగాలు
కొన్నిసార్లు చిన్నపేగు పూర్తిగా తన విధులను నిర్వహించడంలో విఫలం అయితే రోగికి ఆహారాన్ని సెలైన్ ద్వారానే అందించాల్సి ఉంటుంది. అలా సెలైన్ ద్వారా కూడా రోగికి ఆహారాన్ని అందించలేని పరిస్థితుల్లో రోగి తనంతట తానే ఆహారాన్ని తీసుకుని అరిగించుకునేందుకు చిన్నపేగు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది.

వేద గణితం

ఇచ్చిన భిన్నం హారంలో ఒకట్ల స్థానంలో 9 లేనిచో, ఆ ఇచ్చిన భిన్నంలో లవ, హారాలను ఒకే సంఖ్య (తగిన సంఖ్య)చే గుణిస్తే... హారంలోని ఒకట్ల స్థానంలో 9 వస్తే, అలాంటి భిన్నాన్ని ‘ఏకాధికేన పూర్వేణ’ అనే వేదగణిత సూత్రాన్ని ఉపయోగించి, దశాంశ భిన్నాన్ని ఒక్క సోపానంలో మార్చి రాయగలం.




ఐతే పై సమస్యను పూర్తిగా సోపానాలు (Steps) రాయనవసరం లేదు. సగం సమస్య భాగాన్ని పూర్తిచేసి, మిగిలిన సగ భాగాన్ని తొమ్మిదులతో, ఆ సగం భాగం సంఖ్యలోని అంకెలకు గల భేదాలను రాసి పొందవచ్చు.

1/23 ను దశాంశ భిన్నంగా మార్చినప్పుడు దశాంశ బిందువునకు కుడివైపున (హారం (Dr) - లవం (Nr) = 23-1 = 22) 22 అంకెలుండును. ఇంకా సంగం సమస్య అంటే పై పద్ధతిలో చివరి 22/2 = 11 అంకెలను, ఆ తర్వాత మిగిలిన 11 అంకెలను పదకొండు తొమ్మిదుల సంఖ్యకు, మొదట పొందిన (చివరి అంకెలను) 11 అంకెల సంఖ్యకు గల భేదాన్ని కనుగొని పొందగలం.

Wednesday, January 23, 2013

What is root in a mobile and what does it mean?

Rooting means to have administrator rights, gaining root access, or ability to access and change, system root files. This is like accessing and changing Windows operating system files and registry items.  So, some apps (which are a lot), need root access to work. This could be called in other words having administrator rights to use this app. (which sometimes might use a system file, and sometimes even harm your device. So be caucious what app to install).

                 There are far more benefits to root a phone than there are to leave the phone as is. Disabling many of the ads if not almost all ads showed in your apps is a huge benefit, and even saves money over the ad-free version of the same app. You can remove carrier installed apps that otherwise could not be uninstalled, giving more space back on the phone and possibly memory as it won’t run any more. Under-volting and overclocking the processor can improve performance while improve battery life. There are tons more benefits. Plus, if you want to unroot the phone for sending the phone in for repairs is much simpler to do.

Having a rooted device you can install custom rooms, create partitions in your sd card and a lot more. In my opinion, the best thing to do, is to google more info about rooting. I stayed about one week reading only about rooting and its good things!
You can read even this english wikipedia post, if you want:
http://en.wikipedia.org/wiki/Android_rooting

Checking the Web Site Speed


                          Taking too much time to access your favorite sites? Probably the problem is on the server used by those sites. To make sure that is the problem, use Windows PING facility. Ping is a small program, which sends a 32-bit signal to the Web site server. Next, Ping record the time needed by the server to answer it. To activate Ping:


                      Click on the Start-Run menus, type command, and then click OK. Type PING "site name" in the MS-DOS prompt window, for example PING www.yahoo.com.   In a moment, the result will appear on the screen. A result less than 300ms is normal speed while a result more than 400ms is slow speed.

                      If "Request timed out" message appears on the screen that means the Web site server is not responding in one second. Probably it happens because the server is too slow, or designed on purpose not to respond to the ping test, or you forgot to specify your name server addresses in the TCP/IP settings dialog box.

Format.com Hidden Parameters

FORMAT drive: /AUTOTEST
Checks the existing format of your disk, and then proceeds with an unattended disk format.  It does not prompt for a volume label, it does not prompt to format another disk, no delay, no user intervention, ends without pausing, and displays disk space statistics after completion.

FORMAT drive: /BACKUP
This parameter works exactly like /AUTOTEST, but it does prompt the user for a volume label, and it does display disk space information upon completion.

FORMAT drive: /SELECT
This parameter is similar to using the MIRROR command (MS-DOS 5.0 and earlier only).

FORMAT drive: /U
This parameter performs an unconditional format, which destroys every byte of data on a disk by overwriting it with hex F6h. You cannot unformat a disk formatted using the /U option.

FORMAT drive: /SELECT /U
This particular combination of format.com parameters makes a disk. Do not use these two format switches together on any drive!

FORMAT drive: /Z:n
Formats a FAT32 drive with a cluster size of n times 512 bytes. Meaning:
drive: = your hard drive letter (C:, D:, E:... etc).
n = number of sectors per cluster multiplied by 512 (cluster size in bytes).
Examples:
n = 1    creates a 512 bytes cluster;
n = 2    creates a 1024 bytes (1 KB) cluster;
n = ?    creates a ? x 512 = ???? bytes (???? bytes : 1024 = ? KB) cluster.
You can modify the size of the allocation units (sectors) on a FAT32 drive to your heart's desire.

Printing a Folder List


                       If you want to print a list of all files in a folder, and also list the files in the sub-folders which belong to the folder, add the /S switch to the command line in the MS DOS prompt:

dir c:\abcfiles\*.* /s > c:\abcfiles.txt


which not only lists the files and sub-folders in \abcfiles, but also continues to list the files in all the sub-folders. You can then read it using NotePad or WorPad if the file size getting bigger.

Bonus tip:
If you have Microsoft Outlook installed on your system, then you can get a better list. From the Outlook Bar, click on My Computer. If there is no shortcut to My Computer, you can create it by right click an empty Space in the Outlook Bar, choose Outlook Bar Shortcut, Look in – File system, and click OK. Now expand the folder and subfolder, which you want to print. Click on File – Print menu, adjust your page, and then print the result.

----------------------------------------------------------------------------------------------------

Here's how to print several directories with lots of files and also print full details of the file, date size etc.  Open MS-DOS Command Prompt dialog box. Change to the C:\ root directory by typing in CD\ and then hit Enter. From the C:\ prompt type in DIR /S > DIRLIST.TXT and then hit Enter. That will give you a text document called DIRLIST.TXT which will contain all directories and all the files under each directory, including file sizes and dates. To print or edit the document, open it with Edit application (simply type EDIT DIRLIST.TXT and press Enter).


Tuesday, January 22, 2013

Why Does Windows Crash? The Top 10 Reasons


why does windows crash
Oh, great. Another blue screen, boot issue or frozen screen in Windows. Now you have to restart and lose most or all of the work you’d been trying to accomplish. It’s frustrating both because of the interruption and because the cause often isn’t clear.
Crashes aren’t just a part of using Windows. The operating system is stable for many people, so if your PC consistently crashes there is most likely a reason. Let’s take a look at the 10 most likely reasons why Windows crashes.

Bad Memory Or Motherboard

why does windows crash
Many crashes, particularly those that result in a Blue Screen Of Death (BSOD), occur because of a memory or motherboard issue. This can result in a Fatal Exception Error, which basically means data that should be stored in memory could not be retrieved.
You can test memory with a utility like Memtest86 or, in some cases, a built-in motherboard diagnostic tool (see the motherboard’s manual).  Another way to test is to simply swap in new memory and see if the issue goes away. If it does not, and the RAM you installed was correct, the motherboard may be the issue.

BIOS Settings

reasons windows crash
Most motherboards come from the factory with settings that are broadly compatible. These then might be altered by the PC’s builder, be it a company or individual. The settings should stick but they’ll revert to default if the CMOS battery (which powers the BIOS memory) goes flat. That can cause your boot order to be re-arranged or put different components in conflict.
Another common problem with boot order is a high placement of USB or CD-Drives. If you leave USB drive plugged in to your PC, and the BIOS is set to boot from USB first, your PC will not boot properly. You can change the boot order or simply remove the offending drive.

Corrupt Registry

The Windows Registry doesn’t run into problems like it used to, but issues are still possible. A corrupt registry can cause a computer to crash or may prevent it from booting properly.
Quality registry fix software can often fix this problem. If your computer will not boot properly try to run Windows in Safe Mode and run the software from there.

Incorrect Or Corrupt Drivers

reasons windows crash
Drivers tell hardware what to do. If they aren’t working properly they can cause crashes, including BSODs, even if the hardware is perfect condition.
Crashes of this type are usually associated with an error message. Sometimes the error message will clearly name the offending hardware. If it does not, try running the message through Google to see if that helps you find the culprit.
Once the hardware driver with a problem is identified you can search online for an updated driver and install it. If the problem persists, try completely uninstalling the driver and then re-installing it from scratch.

Hard Drive Problems

A hard drive failure is a leading cause of boot issues. If your computer mysteriously loses its ability to find the boot drive, but BIOS is properly configured, a hard drive issue is the culprit. Hard drive issues are also often behind crashes that occur only when opening a specific file.
If you can still boot to the drive try running a free hard drive test to see if there’s any obvious issues. A healthy report should give you cause to look elsewhere for the problem, but a bad report means your drive has one foot in the grave.
A drive that doesn’t boot at all is bad news. Try it with another PC, if possible, to confirm the drive is the problem. I hope you backed up your data!

Hardware Conflicts

reasons windows crash
Windows can sometimes crash if it is receiving conflicting information from different pieces of hardware. This is a hardware conflict. It’s not always harmful, but it’s a common source of freezes and BSODs.
You can see if there’s a hardware conflict by opening the Device Manager. If a conflict exists it will be visible in this utility with a yellow and black exclamation icon. Take a look at the hardware that is conflicting and view its properties through the right-click menu to find more information.
From there, solutions vary. Sometimes the issue is caused by drivers. In other cases it can be caused by BIOS misconfiguration or faulty hardware. Try searching the Internet or ask fellow readers at MakeUseOf Answers.

Virus Or Trojan

reasons windows 7 crashes
A virus or Trojan can cause serious harm to a PC. It might corrupt or remove drivers, delete important system files or change administrative settings. All of these can cause unexpected crashes, freezes or leave you locked out of programs.
To be honest, any fight against malware is usually lost the moment you notice it. The problem is that, once it’s taken hold on your system, it’s very difficult to trust that the methods you’d normally use to diagnose your PC are working as they should. The best you can do is download a trusted antivirus and start scanning.
If you can’t seem to root out the malware you made need to nuke the drive and re-install Windows. This is why you should always use an antivirus, run a firewall and frequently back up your data.

Power issues

reasons windows 7 crashes
In some cases a persistent crash issue, particularly a random reboot or a BSOD caused by hardware you’ve verified to be working properly, is the result of a power issue. You should only turn to this possibility if you’ve eliminated all other possibilities.
There are two potential causes. By far the most common is faulty power supply. A problem with the supply that reduces the power it can deliver, or causes an uneven flow of power, can result in otherwise unexplainable crashes. The only solution is to replace the power supply.
Problems with the power in your home or apartment could also be the problem. An overloaded circuit, poor wiring or a faulty power strip could be the culprit. You can diagnose this by moving the PC to another room to see if the crashes suddenly stop.

Software

Most software errors will not cause Windows to crash. Both the operating system and the software that runs on it have become more reliable over the years.
Still, software issues can cause random lock-ups. The culprit is often obvious because the problem only occurs when that software is used. It will be less obvious if the problem software is running in the background.
In rare cases your PC might freeze on boot because of software that runs automatically. You can usually resolve this by booting to safe mode and using msconfig to disable software that runs at boot.

Overheating

reasons windows 7 crashes
Computer components are sensitive to heat. Too much can cause permanent damage, so hardware will shut itself down before that point is reached. A crash error can result.
Overheating can be blamed for random re-boots and BSODs that appear to be driver issues but occur after the driver is re-installed. A beep or series of beeps from the computer at the time it crashes might be an error code telling you the processor has overheated. Check the motherboard’s manual to confirm.
There source of the problem can vary. It may be inadequate case ventilation, a faulty fan or heatsink that has loosened. Laptops can overheat simply because they’re placed on the wrong surface.

Conclusion

This list should provide some insight into why crashes can be so persistent and annoying. There are many reasons why Windows could crash, and often a single problem might have multiple possible causes. I hope this article has pointed you in the right direction.